
టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి టెక్ కంపెనీలు రోజుకో కొత్త ఇన్నోవేషన్తో ముందుకొస్తున్నాయి. లేటెస్ట్గా ఎయిర్ టెల్ కంపెనీ కూడా ఆన్ లైన్ మోసాలను అడ్డుకునే పనిలో భాగంగా ఏఐని ఉపయోగించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్డిటెక్షన్ సిస్టమ్ను ఆవిష్కరించింది. ఇది ఎయిర్ టెల్ మొబైల్, బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్లన్నింటిలో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ టూల్ ఏం చేస్తుందంటే.. స్పామ్ చేసే వెబ్ సైట్లను రియల్ టైంలో ఆటోమెటిక్గా గుర్తించి వెంటనే బ్లాక్ చేస్తుంది.
ఈమెయిల్స్, వెబ్ బ్రౌజర్లు, ఎస్ఎంఎస్లు, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లతో పాటు పాపులర్ ఓటీటీ యాప్స్లో కూడా ఇంటర్నెట్ యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఏదైనా అనుమానాస్పద వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ కాకుండా బ్లాక్ అయినట్టు సమాచారం వస్తుంది. ఎందుకు బ్లాక్ అయిందో కూడా కారణం చూపిస్తుంది. మల్టీ లేయర్డ్ అప్రోచ్తో పనిచేసే ఈ టెక్నాలజీ వాడేందుకు అదనంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన పనిలేదు. యాక్టివేట్ చేసుకోవాల్సిన ప్రత్యేక ఫీచర్లు కూడా ఏమీ లేవు. ఇది డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది.