ఏఐతో సైబర్ మోసాలకు చెక్ పెడుతున్న ఎయిర్టెల్

ఏఐతో సైబర్ మోసాలకు చెక్ పెడుతున్న ఎయిర్టెల్

టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఆన్​లైన్​ మోసాలు కూడా పెరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి టెక్​ కంపెనీలు రోజుకో కొత్త ఇన్నోవేషన్​తో ముందుకొస్తున్నాయి. లేటెస్ట్​గా ఎయిర్ టెల్ కంపెనీ కూడా ఆన్​ లైన్​ మోసాలను అడ్డుకునే పనిలో భాగంగా ఏఐని ఉపయోగించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్​డిటెక్షన్ సిస్టమ్ను ఆవిష్కరించింది. ఇది ఎయిర్ టెల్ మొబైల్, బ్రాడ్ బ్యాండ్ నెట్​వర్క్​లన్నింటిలో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ టూల్ ఏం చేస్తుందంటే.. స్పామ్​ చేసే వెబ్ సైట్లను రియల్​ టైంలో ఆటోమెటిక్​గా గుర్తించి వెంటనే బ్లాక్​ చేస్తుంది.

ఈమెయిల్స్, వెబ్ బ్రౌజర్లు, ఎస్​ఎంఎస్​లు, వాట్సాప్​, టెలిగ్రామ్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్లతో పాటు పాపులర్ ఓటీటీ యాప్స్లో కూడా ఇంటర్నెట్ యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఏదైనా అనుమానాస్పద వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అది ఓపెన్​ కాకుండా బ్లాక్ అయినట్టు సమాచారం వస్తుంది. ఎందుకు బ్లాక్ అయిందో కూడా కారణం చూపిస్తుంది. మల్టీ లేయర్డ్ అప్రోచ్​తో పనిచేసే ఈ టెక్నాలజీ వాడేందుకు అదనంగా ఎలాంటి యాప్​లు ఇన్​స్టాల్ చేయాల్సిన పనిలేదు. యాక్టివేట్ చేసుకోవాల్సిన ప్రత్యేక ఫీచర్లు కూడా ఏమీ లేవు. ఇది డిఫాల్ట్​గా ఎనేబుల్ అయి ఉంటుంది.