దసరా సెలవు మార్చాలని.. ఇయ్యాల (సెప్టెంబర్ 29) బొగ్గు గనులపై ధర్నాలకు ఏఐటీయూసీ పిలుపు

దసరా సెలవు మార్చాలని.. ఇయ్యాల (సెప్టెంబర్ 29) బొగ్గు గనులపై ధర్నాలకు ఏఐటీయూసీ పిలుపు

కోల్​బెల్ట్, వెలుగు: దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వస్తున్నందున్న దసరా సెలవు తేదీని సింగరేణిలో మార్చాలని బీఎంఎస్​స్టేట్​ప్రెసిడెంట్​యాదగిరి సత్తయ్య, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, సీఐటీయూ ప్రెసిడెంట్​ వెంకటస్వామి ఆదివారం వేర్వేరుగా ప్రకటనల్లో డిమాండ్​ చేశారు. 

మహాత్ముడి జయంతి రోజు జీవహింసకు పాల్పడడం చట్టవిరుద్ధమని, దసరా పండుగను కార్మికులు, వారి కుటుంబాలు సంతోషంగా జరుపుకునేలా సర్కార్, సింగరేణి యాజమాన్యం అక్టోబర్ 1న లేదా 3న దసరా సెలవు ప్రకటించాలని కోరారు. ఒకే రోజు రెండు పీహెచ్​డీలు ఉండటం వల్ల కార్మికుల ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. దేశంలోని ఇతర బొగ్గు పరిశ్రమల్లో  సెలవును మార్చినట్లు తెలిపారు. 

సింగరేణిలో అక్టోబర్​3న దసరా పండుగ సెలవు ప్రకటించాలని డిమాండ్​చేస్తూ సోమవారం శ్రీరాంపూర్​ఏరియా బొగ్గు గనులపై ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఎస్కే బాజీసైదా పేర్కొన్నారు.