‘దృశ్యం 2’ నుంచి న్యూ పోస్టర్

‘దృశ్యం 2’  నుంచి న్యూ పోస్టర్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నాడు. ఆయన లెటెస్ట్ ఫిల్మ్ ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘అజయ్’ న్యూ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ ను సోషల్ మీడియాలో అజయ్ దేవగన్ పోస్టు చేశారు. ఓ చేతిలో పలుగు పట్టుకుని గంభీరంగా కనిపిస్తున్నాడు. ‘మీ కళ్ల ముందు  ఏమి కనబడుతుందో అది ఛాలెంజ్ కాదు..ఛాలెంజ్ ఏంటంటే.. మీరు ఏం చూస్తున్నారు’ అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు. దృశ్యం 2 సినిమా నవంబర్ 18న విడుదల కానుంది.

విజయ్ సల్గాంకర్ పాత్రలో అజయ్ దేవగన్ నటించారు. ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే కుర్రాడి శవాన్ని కన్ స్ట్రక్షన్ లో ఉన్న పీఎస్ లో ‘అజయ్’ పాతిపెట్టడంతో  దృశ్యం సినిమా ముగుస్తుంది. వరుణ్‌ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. అజయ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని వరుణ్ కుటుంబం భావిస్తుంది. కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకొనేందుకు అజయ్ ఎలాంటి ఎత్తుగడలు వేశాడన్నదే దృశ్యం 2 కథ. దృశ్యం 2 సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను అజయ్ ఆసక్తికరంగా ప్రారంభించారు. ఈ సినిమాలో శ్రియా శరణ్, టబు, అక్షయ్ ఖన్నాలతో పాటు ఇషితా దత్, మృణాల్ జాదవ్, రజత్ కపూర్ లు నటించారు.