‘ఖైదీ’కి ఇది అఫీషియల్ రీమేక్

‘ఖైదీ’కి ఇది అఫీషియల్ రీమేక్

ఆకట్టుకునే రూపమే కాదు అంతే అద్భుతంగా నటిస్తుంది కూడా టబు. అందుకే కెరీర్‌‌‌‌ మొదలై ముప్ఫై ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాలు చేస్తోంది. వాటిలో రెండు చిత్రాలు అజయ్ దేవగణ్‌‌తోనే. అందులో ఒకటి ‘దృశ్యం 2’, మరొకటి ‘భోళా’. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ లొకేషన్‌‌లో అజయ్ దేవగణ్‌‌తో కలిసున్న ఉన్న ఫొటోను టబు షేర్ చేసింది.

ఇందులో ఆమె పోలీసాఫీసర్‌‌‌‌గా నటిస్తుండగా అజయ్ ఖైదీగా నటిస్తున్నాడు. ఆయనే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ సక్సెస్ సాధించిన ‘ఖైదీ’కి ఇది అఫీషియల్ రీమేక్. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అయిన అజయ్‌‌తో టబు కలిసి నటిస్తోన్న తొమ్మిదో సినిమా కావడం విశేషం. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘దృశ్యం 2’ నవంబర్ 18న విడుదల కానుంది.