నాగార్జున మైల్ స్టోన్‌‌‌‌ మూవీకి రంగం సిద్ధం

నాగార్జున మైల్ స్టోన్‌‌‌‌ మూవీకి రంగం సిద్ధం

కథ నచ్చితే కొత్త దర్శకులతోనైనా సినిమాలు చేయడానికి వెనుకాడరు నాగార్జున. డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ సీనియర్ హీరోల్లో  ఆయనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లోని 100వ సినిమాను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీని తమిళ దర్శకుడు కార్తీక్‌‌‌‌ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథను విన్న నాగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారట. కంప్లీట్ ఫ్యామిలీ  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా దీన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక ధనుష్‌‌‌‌తో కలిసి ఆయన నటించిన  ‘కుబేర’ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలాగే రజినీకాంత్‌‌‌‌ ‘కూలీ’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్ మూవీస్‌‌‌‌తో ఆడియెన్స్‌‌‌‌ ముందుకు వస్తున్నారు నాగార్జున. మరోవైపు ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే స్పెషల్ మూవీస్‌‌‌‌గా నిలిచిన ‘శివ’, ‘మాస్’ చిత్రాలు ఆయన బర్త్‌‌‌‌డే సందర్భంగా  రీ రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు.