ముంబై పోలీసుల‌కు ఫిట్‌నెస్ హెల్డ్ ట్రాకింగ్ డివైజ్‌లు అందించిన అక్షయ్

ముంబై పోలీసుల‌కు ఫిట్‌నెస్ హెల్డ్ ట్రాకింగ్ డివైజ్‌లు అందించిన అక్షయ్

ముంబై పోలీసుల‌కి ఫిట్‌నెస్ హెల్డ్ ట్రాకింగ్ డివైజ్‌లు అంద‌జేశారు బాలీవుడ్ స్టార్ హీరో  అక్ష‌య్ కుమార్.  క‌రోనా సంక్షోభంలో పెద్ద మ‌న‌సుతో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. పీఎం కేర్ ఫండ్‌కి రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు  ముంబై కార్పొరేష‌న్‌కి రూ.3 కోట్లు, ముంబై పోలీసుల‌కి రూ. 2కోట్లు విరాళంగా ఇచ్చారు. లేటస్టుగా ముంబై పోలీసుల‌కి ఫిట్‌నెస్ హెల్డ్ ట్రాకింగ్ డివైజ్‌లు అంద‌జేశారు. ఈ డివైజ్ ధ‌రిస్తే ఆక్సీజ‌న్‌, శ‌రీర ఉష్ణోగ్ర‌త‌, హార్ట్ రేట్ తెలిసిపోతుంద‌ట. అక్ష‌య్ సాయాన్ని అభినందిస్తూ మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. ముంబై పోలీసుల క‌న్నా ముందు నాసిక్ పోలీసుల‌కు కూడా అక్ష‌య్ హెల్త్ ట్రాకిండ్ డివైజ్ అందించారు. సైన్యానికి, పోలీసుల‌కి అక్ష‌య్ ఎప్పుడు మ‌ద్ద‌తుగా నిలుస్తుంటారు. కోవిడ్ వారియ‌ర్స్‌పై  ఆయ‌న చూపిస్తున్న శ్ర‌ద్ధ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అని  ఆదిత్య తెలిపారు.