జీడిమెట్ల, వెలుగు : నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ బుధవారం డిప్యూటీ తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ నిజాంపేట్లో సర్వే నంబర్191లో 125గజాలకు పర్మిషన్ తీసుకుని ప్రభుత్వ భూమి ఆక్రమించి 190గజాల్లో అపార్ట్మెంట్ నిర్మాణం చేశాడని ఆరోపించారు.
అలాగే 400 గజాల ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డు, 8 బేస్మెంట్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కార్పొరేటర్ బాలాజీ నాయక్పై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో అరుణ్రావు, శేషారావు, ప్రసాద్ రాజు, మాధవరాజు తదితరులు ఉన్నారు.