ఖైరతాబాద్, వెలుగు : గెలిచిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కట్టడికి జిల్లాకు 100 మంది చొప్పున కనీసం 15టీమ్స్ ఏర్పాటు చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సూచించారు. బీఆర్ఎస్కు సీట్లు తక్కువ వస్తే కేసీఆర్ ఇతర పార్టీల నేతలను కొంటాడని ప్రచారం జరుగుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ దుర్మార్గపు బుద్ధినిఅధిగమించి కాంగ్రెస్తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కోరారు. 'ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేద్దాం?' అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీనియర్ జర్నలిస్టు సతీష్ కమాల్అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోరని, గవర్నర్ పట్టించుకోరని అన్నారు. ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. చట్టాలు అందరికీ సమానమేనని, అయితే ఆ చట్టాలు కొందరికి చుట్టమయ్యాయని వెల్లడించారు. సీనియర్పాత్రికేయులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ..గత 10ఏండ్లల్లో అధికార పార్టీలోకి 45 మంది ఎమ్మెల్యేలు మారారని చెప్పారు.
వారు మారింది నియోజక వర్గ అభివృద్ధి కోసం కాదని స్వలాభం కోసమేనని వివరించారు. సమావేశంలో సీపీఎం నేత నర్సింహరావు, దాసరి శ్రీనువాసు, తెలంగాణ విఠల్, పృథ్వీరాజ్ యాదవ్, సొగరా బేగం, మహిపాల్యాదవ్, బీఎస్పీ నాయకుడు విజయ్ యాదవ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతలు తదితరులు పాల్గొన్నారు.