
న్యూఢిల్లీ: డచ్ పెయింట్ తయారీ కంపెనీ అక్జో నోబెల్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ పెయింట్స్ రూ. 12,915 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద లావాదేవీలలో ఇదీ ఒకటని కంపెనీ ప్రకటించింది. జేఎస్డబ్ల్యూ పెయింట్స్.. డ్యూలక్స్ పెయింట్ తయారీ సంస్థ అక్జో నోబెల్ ఇండియాలో 74.76 శాతం వాటాను రూ. 8,986 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఓపెన్ మార్కెట్ నుంచి మరో 25 శాతం కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ను రూ. 3,929.06 కోట్లకు ప్రకటించింది. దీంతో మొత్తం రూ. 12,915 కోట్లు అవుతుంది. గత నెలలో జపాన్కు చెందిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్ప్, యెస్ బ్యాంక్లో 20 శాతం వాటాను రూ. 13,483 కోట్లకు కొనుగోలు చేసిన దాని కంటే ఇది కొంచెం తక్కువ.