దీపావళి సేల్స్..బీ కేర్ ఫుల్ .. ఆన్ లైన్ షాపింగ్ మాటున అసలుకే మోసం

దీపావళి సేల్స్..బీ కేర్ ఫుల్ .. ఆన్ లైన్ షాపింగ్ మాటున అసలుకే మోసం
  • ఫేక్​ ఫ్రొడక్ట్స్, అన్​ఆథరైజ్డ్​ సేల్స్​తో జర పైలం
  • చిన్న ట్రిక్స్​తో చెక్​ చేసి కొంటే సేఫ్​
  •     జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: పండగలు వచ్చాయంటే.. ఈ కామర్స్​వెబ్​సైట్స్​లో షాపింగ్​జోరు పెరుగుతుంది. రూ. 100 నుంచి మొదలుకుంటే రూ. లక్షల రూపాయల వరకు.. గ్రాసరీ నుంచి మొదలుకుంటే ఎలక్ట్రానిక్​ఐటమ్స్​వరకు ప్రతి ఒక్కటీ తక్కువకు దొరుకుతుందని ఆన్​లైన్​లోనే కొనుగోలు చేస్తుంటారు. ఆఫ్​లైన్​కంటే ఆన్​లైన్​లోనే ఆఫర్లు ఎక్కువగా వస్తాయని కస్టమర్లు అట్రాక్ట్​అవుతుంటారు. అయితే, ఆన్​లైన్​షాపింగ్​పట్ల అవగాహన, జాగ్రత్తలు లేకపోతే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆన్​లైన్​షాపింగ్​చేస్తూ మోసపోతున్న వారి సంఖ్య ఈ మధ్య పెరిగిపోతోంది. అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ వంటి పెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌‌ఫామ్‌‌లపై 2025లో జూన్​వరకే 7,200కి పైగా కంప్లయింట్స్​వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దీపావళి సేల్స్​లోనూ ఇలాంటి మోసాలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  
ఫేక్ ప్రొడక్టులు, అన్​ఆథరైజ్డ్​ సేల్స్​ 
ఈ -కామర్స్ ప్లాట్‌‌ఫామ్స్ లో వివిధ రూపాల్లో మోసాలు జరుగుతున్నాయి. ఫేక్ (ఒకటి ఆర్డర్​చేస్తే మరొకటి రావడం) బ్రాండ్​ ను పోలిన రెప్లికా( అచ్చం ఒరిజినల్ లా కనిపించే డూప్లికేట్​వస్తువు), బ్రాండ్ అబ్యూస్​( చిన్న అక్షరాలతో బ్రాండ్​పేరు మార్చి పంపడం) తో వేల మంది కస్టమర్లు నష్టపోతున్నారు. వీటితో పాటు అన్​ఆథరైజ్డ్​ప్రొడక్ట్స్​అమ్మడం, ప్రొడక్టు క్వాలిటీని తప్పుగా చూపించడం, డెలివరీ జరగకపోవడం వంటి ఫ్రాడ్స్​కామన్​గా జరుగుతుంటాయి. ఇలా 2024 నుంచి 2025 జనవరి వరకు దేశవ్యాప్తంగా ఈ కామర్స్​వెబ్​సైట్స్​వల్ల రూ.4,245 కోట్లకు పైగా నష్టం జరిగింది. 2025లో ఈ మొత్తం రూ.20వేల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
అఫీషియల్​ పార్ట్​నర్స్​ వద్దే కొనండి..
ఆన్​లైన్​లో వస్తువులు కొనే ముందు అస్యూర్డ్​లేబుల్​ఉందో లేదో చూసుకొని కొంటే రిస్క్​ఉండదు. ఉదాహరణకు ఒక వస్తువును అఫీషియల్​ఈ కామర్క్​బ్రాండ్​పార్ట్​నర్​మాత్రమే అమ్ముతుంది. అయితే అన్​అఫీషియల్​గా వేరే ప్లాట్​ఫామ్​లో కూడా ఈ సేల్స్​జరుగుతుంటాయి. ఉదాహరణకు నథింగ్, మోటో వంటి కంపెనీలు తమ మొబైల్స్​ఫ్లిప్​కార్ట్​లోనే అమ్ముతుంటాయి. అలాగే, వన్​ప్లస్​, ఐక్యూ వంటి కంపెనీలు అమెజాన్​లో తమ ప్రొడక్ట్స్​అఫీషియల్​గా సేల్​చేస్తుంటాయి. కానీ, మనం అప్పుడప్పుడు ఫ్లిప్​కార్ట్ లో వన్​ప్లస్​, ఐక్యూ.. అమెజాన్​లో నథింగ్​, మోటో మొబైల్స్​కూడా కనిపిస్తుంటాయి. ధర కూడా అఫీషియల్​పార్ట్​నర్​వెబ్​సైట్స్​కంటే తక్కువగానే కనిపిస్తుంది. అయితే, వీటిని కొనే ముందు కస్టమర్లు ఆలోచించాలి. ఎందుకంటే సెకండ్​హ్యాండ్​, రీఫర్బిష్డ్​మొబైల్స్​కూడా మనకు అంటగడుతుంటారు.  ఒక వేళ అన్​ అఫిషియల్​ప్లాట్​ఫామ్​నుంచి కొంటే సదరు వస్తువు బ్రాండ్​ వెబ్​ సైట్​లోకి వెళ్లి ఆ వస్తువు సీరియల్​నంబర్, మొబైల్​అయితే ఐఎంఈఐ నంబర్​ఎంటర్​చేసి కొత్తదో.. పాతదో తెలుసుకోవచ్చు. అందులో ఎప్పుడు మాన్యుఫ్యాక్చర్​అయ్యింది. ఎప్పుడు యాక్టివ్​అయ్యింది.. బ్యాటరీ ఎంత యూజ్​అయ్యింది అన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చు. 


ఫేక్​ వెబ్​సైట్స్​తో...

అమెజాన్ లేదా ఫ్లిప్‌‌కార్ట్‌‌లా కనిపించే ఫేక్ వెబ్​సైట్‌‌లు సృష్టించి సైబర్​క్రిమినల్స్​రూ.కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. వీరు సోషల్ మీడియాలో సదరు వెబ్​సైట్స్​అని చెప్తూ లింకులు పంపిస్తారు. అందులో ఆపిల్​ఫోన్ రూ.5 వేలే అని, వేలల్లో ఉన్న వస్తువులు రూ.వందల్లో దొరుకుతాయని సోషల్​మీడియాలో ప్రకటనలు పంపిస్తారు.​అలాగే, ఏదైనా సెర్చ్​ఇంజిన్​లో ఫ్లిప్​కార్ట్, అమెజాన్​అని టైప్​చేయగానే పైన నకిలీ వెబ్​సైట్స్​ఉండేలా చూస్తారు. వీటిని క్లిక్​చేస్తే ఫేక్​వెబ్​సైట్​లోకి వెళ్తారు. అచ్చం ఒరిజినల్​వెబ్​సైట్​మాదిరే డిజైన్​చేస్తారు. ఇక్కడ పేమెంట్​చేయడం వల్ల కస్టమర్లు నష్టపోతారు. అలాగే, మోసగాళ్లు కస్టమర్లకు బిగ్​బిలియన్​డేస్​లో తక్కువ ధరకు ప్రొడక్ట్స్​ఇస్తున్నామని ఫేక్ ఈమెయిల్స్, ఎస్ఎమ్ఎస్‌‌లు పంపుతారు. ఇలాంటి మోసాలకు ఎక్కువగా దసరా, దీపావళి, సంక్రాంతి, రిపబ్లిక్​డే, ఇండిపెండెన్స్​డే వంటి రోజులను ఎంచుకుంటారు. 

ఇవిగో జాగ్రత్తలు..

 

  •  అమెజాన్​లో ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​పేరుతో దీపావళి సేల్ మొదలవ్వగా, ఫ్లిప్‌‌కార్ట్​లో ‘బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్’ అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కస్టమర్లు కింది జాగ్రత్తగా తీసుకుంటే మోసపోకుండా ఉంటారు.  
  • ఈ కామర్స్​అస్యూర్డ్​ప్రొడక్ట్స్​మాత్రమే కొనండి. అస్యూర్డ్​అంటే సదరు ప్రొడక్ట్​కు తమది గ్యారంటీ అని ఈ కామర్స్​వెబ్​సైట్ గ్యారంటీ ఇస్తుందన్నమాట..​
  • వస్తువు కొనేటప్పుడు దాని సెల్లర్​ఎవరు? బ్రాండ్​రిజిస్టర్​అయి ఉందా లేదా చెక్​చేయండి. 
  •  ప్రొడక్ట్​రేటింగ్​చూసి కొనడానికి అస్సలు ప్రయత్నం చేయొద్దు.. ఈ మధ్య పేరు మోసిన కంపెనీలు కూడా కస్టమర్లను ప్రలోభ పెట్టి రేటింగ్​లు తీసుకుంటున్నాయి. దీనికి బదులు చాలా మంది యూట్యూబర్లు ప్రొడక్ట్స్​రివ్యూలను ఇస్తుంటారు. ఇందులో రెండు లేదా మూడు వీడియోలు చూస్తే ఆ ప్రొడక్ట్​ఎలాంటిదో తెలిసిపోతుంది.   
  • ఫేక్ లింక్‌‌లు క్లిక్ చేయకండి. స్పామ్​ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెసేజ్ వచ్చినా క్లిక్​ చేయకుండా.. ఒరిజనల్​ వైబ్​సైట్​లోకి లాగిన్ అయి.. ఆఫర్​చెక్​ చేసుకుంటే బెటర్​..
  • అక్స్ నౌ, లిమిటెడ్ స్టాక్, వంటి మెసేజ్​లు వెంటనే నమ్మవద్దు.  
  • సెక్యూర్ పేమెంట్స్: యూపీఐ కార్డ్ వివరాలు షేర్ చేయకండి. ఓటీపీలు అడిగితే జాగ్రత్తగా ఉండాలి.  HTTPS అనే సేఫ్​డొమైన్లు చెక్ చేయండి.
  • ప్రొడక్ట్ డెలివరీ టైం, అన్​బాక్సింగ్​చేసేప్పుడు వీడియో తీసుకోండి. ఫేక్, తప్పు ప్రొడక్ట్ వచ్చినా ఎవిడెన్స్‌‌గా ఉపయోగపడుతుంది.
  • అనుమానాస్పద మెసేజ్‌‌లు, లింక్​లు వచ్చినప్పుడు  సదరు ఫేక్​ఈ కామర్స్​వెబ్​సైట్స్​గురించి సైబర్‌‌క్రైమ్ పోర్టల్ కు రిపోర్ట్ చేయండి.