కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్శంకర్, పాల్వయ్హరీశ్బాబుతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి రూ.33 వేల కోట్ల ఆదాయం, రూ.62వేల కోట్ల అప్పు తీసుకువస్తామని చెప్తున్నారని.. ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఇదెలా సాధ్యమో చెప్పలేదన్నారు.
అలాగే రూ.50వేల కోట్ల రెవెన్యూ వస్తుందంటున్నరు.. కానీ అది ఏ రూపంలో వస్తుందో కూడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, హమీలు తప్ప కేటాయింపులు లేవని తెలిపారు. 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
