అల్ఫోర్స్ ఎన్‌‌‌‌సీసీ కేడెట్లకు సర్టిఫికెట్ల అందజేత

అల్ఫోర్స్ ఎన్‌‌‌‌సీసీ కేడెట్లకు సర్టిఫికెట్ల అందజేత

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ఈ టెక్నో స్కూల్​ఎన్​సీసీ కేడెట్లకు శనివారం సర్టిఫికెట్లు అందజేశారు.  ఈ ప్రోగ్రాం స్కూల్​ చైర్మన్​ నరేందర్​రెడ్డి ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు.  విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి దేశభక్తి పెంపొందించుకుని దేశం పట్ల విధేయత ప్రదర్శించాలన్నారు. ఎన్​సీసీతో దేశ సమగ్రతను పెంపొందించడమే కాకుండా దేశంలో చోటుచేసుకుంటున్న పలు పరిణామాలను అరికట్టవచ్చన్నారు. 46 మంది విద్యార్థులకు ఏ సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో స్కూల్​ ప్రిన్సిపల్, టీచర్స్​ పాల్గొన్నారు.