భీమదేవరపల్లి, వెలుగు: హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. రైతులు, మహిళలు, గ్రామాల అభ్యున్నతికి సహకార సంస్థల ద్వారా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ చేసిన విశిష్ట సేవలకు గానూ ఆయనను గౌరవించినట్లు నిర్వాహకులు తెలిపారు.
