భక్తుడి చేతిలో గుట్కా.. అలిపిరి దగ్గర గొడవ

భక్తుడి చేతిలో గుట్కా.. అలిపిరి దగ్గర గొడవ

తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ జరిగింది.  తమిళనాడు రాష్ట్రం చెంగల్ పట్టుకు  చెందిన 45మంది భక్త బృందం తిరుమల శ్రీవారిని దర్సించుకోవడానికి తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర లగేజ్ చెక్ చేస్తుండగా నారాయణస్వామి అనే భక్తుడు గుట్కా ప్యాకెట్ తో కన్పించాడు. గుట్కా  తీసుకెళ్ళకూడదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో…  ఆ ప్యాకెట్ ను కిందపడేసి  లగేజ్ ను చెక్ చేయించుకుని వెళ్లాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చి మళ్లీ గుట్కా పాకెట్ ను తీసుకున్నాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది… చేతిలో ఉన్న గుట్కా ప్యాకెట్ ను బలవంతంగా తీసుకున్నారు. దీంతో సెక్యూరిటీతో గొడవ పడటంతో… నారాయణస్వామి పై దాడి చేశారు. అడ్డొచ్చిన భక్తబృందాన్ని కూడా  కొట్టారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.