హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో జరిగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తితో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అంబేడ్కర్ వర్సిటీ డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www. braouonline.in లో చూడొచ్చని సూచించారు.
మరిన్ని వార్తల కోసం: