
సాధారణ ప్రజలు, విద్యార్థులు అందరూ డ్రగ్స్ రహిత సమాజం తమ బాధ్యతగా భావించాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు. తమ పరిసరాల్లో, కాలేజీల్లో, పాఠశాలల్లో మత్తు పదార్థాల వాడకం గురించి పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. తెలిసీ తెలియక మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తుపదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా జూన్ 27, 2024 మహేశ్వరంలో యాంటీ డ్రగ్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత తమ వంతు భాధ్యత నిర్వహించాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి వచ్చే నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శశాంక, పలువురు ఐపీఎస్ లు పాల్గొన్నారు.