దుకాణాలు, పలు సంస్థలు తమ కార్యకలాపాలను 24 గంటలు నడుపుకునేలా ప్రభుత్వం త్వరలో వెసులు బాటు కల్పించనుంది. హైదరాబాద్లో 24 గంటలు దుకాణాలు ఓపెనింగ్ చేసే ప్లాన్ త్వరలో అమల్లోకి రానుంది. ఏ విభాగం నోడల్ అథారిటీగా అనుమతులు ఇవ్వాలనే దానిపై నెలకొన్న సందిగ్ధత పరిష్కరమై, ఆ పనిని కార్మిక శాఖకు అప్పగించారు. ఈ శాఖ 24 గంటల అనుమతి కోరే వారికి పర్మిషన్ ఇస్తుంది. గతంలోనే దీనికి సంబంధించిన జీవో జారీ చేసినప్పటికీ.. కార్మిక శాఖ,పోలీస్ శాఖల ప్రమేయం ఉన్నందు వల్ల అమలులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు పలు మార్పులు చేసి సవరించిన జీవోని మరి కొన్ని రోజుల్లో జారీ చేయనున్నారని అధికారులు చెబుతున్నారు.
- 24 గంటలు నడిచే దుకాణదారుల యజమానులు రూ.10 వేలు చెల్లించి కార్మిక శాఖ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- ఎక్సైజ్ యాక్ట్ కిందకి వచ్చే వైన్స్24 గంటలు నడిచేందుకు అనుమతి లేదు.
- వీకెండ్స్ లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.
- కార్మిక శాఖ నుంచే అనుమతులు పొందాలి.
- అనుమతుల కోసం మొదట పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
- అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే అనుమతి రద్దు చేస్తారు.