గతంలో సింగిల్ పట్టి మిర్చికి రూ.40 వేలు
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సోమవారం మిర్చి పంటకు ఆల్ టైం రికార్డ్ ధర దక్కింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన రైతు యార రవి 23 బస్తాల దేశీ పంటను విక్రయించడానికి మార్కెట్ తీసుకొచ్చారు. వ్యాపారులు క్వింటాల్రూ. 65 వేల చొప్పున కొనుగోలు చేశారు. సింగిల్ పట్టి మిర్చికి ఎంతో ఫేమస్ అయిన ఏనుమాముల మార్కెట్లో ఇదే ఏడాది మార్చిలో క్వింటాల్ ధర రూ. 40 వేల వరకు పలకగా.. సోమవారం దేశీ రకానికి ఏకంగా రూ.65 వేలు పలికింది.