ఏనుమాముల మార్కెట్​లో ఆల్‍ టైం రికార్డ్​ధర

ఏనుమాముల మార్కెట్​లో ఆల్‍ టైం రికార్డ్​ధర

గతంలో సింగిల్‍ పట్టి మిర్చికి రూ.40 వేలు

వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ ఏనుమాముల మార్కెట్​లో సోమవారం మిర్చి పంటకు ఆల్‍ టైం రికార్డ్​ ధర దక్కింది. వరంగల్‍ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన రైతు యార రవి 23 బస్తాల దేశీ పంటను విక్రయించడానికి మార్కెట్ తీసుకొచ్చారు. వ్యాపారులు క్వింటాల్​రూ. 65 వేల చొప్పున కొనుగోలు చేశారు. సింగిల్‍ పట్టి మిర్చికి ఎంతో ఫేమస్‍ అయిన ఏనుమాముల మార్కెట్‍లో ఇదే ఏడాది మార్చిలో క్వింటాల్‍ ధర రూ. 40 వేల వరకు పలకగా.. సోమవారం దేశీ రకానికి ఏకంగా రూ.65 వేలు పలికింది.