Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!

Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adkku). దర్శకుడు మల్లి అంకం(Mallli Ankam) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా(Fariya Abdullah) హీరోయిన్ గా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సుడిగాడు సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Also Read: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?

“నా కెరీర్ లో కితకితలు మూవీతో పాటు సుడిగాడు కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. సుడిగాడు మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. అంతేకాదు.. ఈ సీక్వెల్ కు కథ కూడా నేనే అందిస్తున్నాను. ప్రస్తుతం స్క్రీప్ట్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తాం.. అంటూ చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. 

నిజానికి ఈ సినిమా సీక్వెల్ పై చాలా మంది ఆడియన్స్ ఇంట్రెస్ట్ గానే ఉన్నా.. ఆ సినిమాకు సీక్వెల్ అంటే కత్తిమీద సామణే చెప్పాలి. ఎందుకంటే.. దాదాపు 12 సంవత్సరం క్రితం అంటే.. హీరోలపై, సినిమాలపై స్పూఫ్ కాన్సెప్ట్ నడిచింది. కానీ, ఇప్పటి జెనరేషన్ చాలా మారిపోయింది. మరోపక్క జబర్దస్త్ లాంటి కామెడీ షోలు కూడా అలాంటి కామెడీని క్రియేట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు సుడిగాడు లాంటి సినిమాకు సీక్వెల్ అంటే అది దానికన్నా బెస్ట్ ఉంటె తప్పా ప్రేక్షకులను మెప్పించడం కష్టం. అందుకే ఈ సినిమా విషయంలో అల్లరోడు సాహం చేస్తున్నాడనే చెప్పాలి.