ఒకప్పుడు కామెడీ సినిమాలతో అల్లరి చేసిన నరేష్.. ఇప్పుడు ‘నాంది’ లాంటి ఎమోషనల్ మూవీస్తో ఆలోచింపజేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా అలాంటిదే. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 11న విడుదల చేయబోతున్నట్టు నిన్న ప్రకటించారు. ‘మారేడుమిల్లి ఎలక్షన్ డ్యూటీకి డేట్ లాక్ చేశాం’ అంటూ కొత్త పోస్టర్ని కూడా వదిలారు. ఎలక్షన్ ఆఫీసర్ నరేష్ నీట్గా టక్ చేసుకుని, బ్యాగ్ తగిలించుకుని, సీరియస్గా నడిచి వెళ్తున్నాడు. వెనుక వెన్నెల కిశోర్, ప్రవీణ్తో పాటు కొందరు పోలీసులు కూడా ఉన్నారు. ఎలక్షన్లు జరిపించడానికి వీరంతా మారేడుమిల్లికి బయలుదేరారని అర్థమవుతోంది.
ఆనంది హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంపత్ రాజ్, సేతురామన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. త్వరలోనే ట్రైలర్ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రా నికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.