RBI గుడ్ న్యూస్ : మినిమమ్ బ్యాలెన్స్ బాదుడుకు చెక్

RBI గుడ్ న్యూస్ : మినిమమ్ బ్యాలెన్స్ బాదుడుకు చెక్

బ్యాంక్ ఖాతా దారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)  గుడ్ న్యూస్ చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా  పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది.  ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు  విత్‌ డ్రాలపై నిబంధనలను ​కూడా  మార్చింది.  నెలకు  4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతోపాటు  ఫ్రీ ఏటీఎం, డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది.  ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.