సాయితేజ్ బతుకుతాడో లేదో అని భయపడ్డా: అల్లు అరవింద్​

 సాయితేజ్ బతుకుతాడో లేదో అని భయపడ్డా: అల్లు అరవింద్​

మెగా హీరో సాయితేజ్​ బైక్ ప్రమాద ఘటన టాలీవుడ్ ను కుదిపేసింది. ఆ గాయాల నుంచి కోలుకుని ‘విరూపాక్ష’ అనే సినిమాతో ఈ హీరో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. తాజాగా ఈ విషయంపై నిర్మాత అల్లు అరవింద్​ స్పందించాడు. హైదరాబాద్​లోని ప్రసాద్స్​మల్టీప్లెక్స్​లో సినిమా ట్రైలర్​ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.​ ‘‘తేజ్​ప్రమాద వార్త విని నేనే మొదట అక్కడికి వెళ్లాను. అతని ఒంటిపై ఒక్క రక్తం చుక్క కనిపించలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి 15 నిమిషాలు పట్టింది. బతుకుతాడో లేదో అని చాలా కంగారు పడ్డాను. 

కానీ, ఆ ఘటన నుంచి బయటపడి విరూపాక్షలో అద్భుతంగా నటించాడని తెలిసింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది”అంటూ అల్లు అరవింద్​తెలిపాడు. కార్తిక్​ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్​గా నటిస్తోంది. దర్శకుడు సుకుమార్​స్ర్కీన్​ప్లేను అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్​ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.