మెగా హీరో సాయితేజ్ బైక్ ప్రమాద ఘటన టాలీవుడ్ ను కుదిపేసింది. ఆ గాయాల నుంచి కోలుకుని ‘విరూపాక్ష’ అనే సినిమాతో ఈ హీరో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. తాజాగా ఈ విషయంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించాడు. హైదరాబాద్లోని ప్రసాద్స్మల్టీప్లెక్స్లో సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘తేజ్ప్రమాద వార్త విని నేనే మొదట అక్కడికి వెళ్లాను. అతని ఒంటిపై ఒక్క రక్తం చుక్క కనిపించలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి 15 నిమిషాలు పట్టింది. బతుకుతాడో లేదో అని చాలా కంగారు పడ్డాను.
కానీ, ఆ ఘటన నుంచి బయటపడి విరూపాక్షలో అద్భుతంగా నటించాడని తెలిసింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది”అంటూ అల్లు అరవింద్తెలిపాడు. కార్తిక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు సుకుమార్స్ర్కీన్ప్లేను అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.