చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్

చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్

'గంగోత్రి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్'.. నేడు పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన యాక్టింగ్, డాన్స్ తో ఎనలేని పాపులారిటీని తెచ్చుకున్నారు. ఒక్కో సినిమాతో ఒక్కో స్టైల్ ను మెయింటైన్ చేస్తూ.. తన హవాను కొనసాగిస్తున్న బన్నీ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రోజుకు 20ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ఈ రోజుతో తాను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నానని రాసుకొచ్చారు. దీనికి కారణం అందరి ఆశీర్వాదం, ప్రేమేనని తెలిపారు. పరిశ్రమలో తనకు చెందిన తన వారికీ, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని అల్లు అర్జున్ ట్వీట్ ద్వారా తెలిపారు.

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత బన్నీ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ మధ్యే 'పుష్ప 2' షూటింగ్ ప్రారంభం అయింది. పార్ట్ 1 సంచలనం సృష్టించడంతో.. ఇప్పుడు పుష్ప రెండో భాగం కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://twitter.com/alluarjun/status/1640581255732535296