త్వరలో బ్లాస్టింగ్ అనౌన్స్‌‌‌‌మెంట్..మళ్లీ కలిశారు

త్వరలో బ్లాస్టింగ్ అనౌన్స్‌‌‌‌మెంట్..మళ్లీ కలిశారు

టాలీవుడ్‌‌‌‌లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. వాటిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరి కలయికలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. లాంటి హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. అలాగే వీరిద్దరూ కలిసి చేసిన కమర్షియల్ యాడ్స్‌‌‌‌కి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌‌‌‌గా ‘ఆహా’ కోసం కూడా ఓ యాడ్ షూట్‌‌‌‌ చేశారు. తాజాగా ఈ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌‌‌‌మెంట్ రాబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం ‘పుష్ప2’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా ప్రకటించారు. అయితే ఈ గ్యాప్‌‌‌‌లోనే త్రివిక్రమ్‌‌‌‌తో మరో మూవీ ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ‘మళ్లీ కలిశారు.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్‌‌‌‌డేట్ రాబోతోంది’ అని నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ ఈ న్యూస్‌‌‌‌కి మరింత  బలం చేకూరేలా ఉంది. నాలుగోసారి  మేజిక్ కాంబో రిపీట్ కానుందనే వార్తతో బన్నీ అభిమానులు ఖుషి అవుతున్నారు. అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.