రెండు చిత్రాలను ఒకే సమయంలో సెట్స్‌‌పైకి తీసుకురావాలనే అల్లు అర్జున్ ప్లాన్‌‌

రెండు చిత్రాలను ఒకే సమయంలో సెట్స్‌‌పైకి తీసుకురావాలనే అల్లు అర్జున్ ప్లాన్‌‌

‘పుష్ప’తో పాన్‌‌ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. ఈ మూవీ సీక్వెల్‌‌తో మరో బడా సక్సెస్‌‌ను అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌‌‌‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.  

ఈ సినిమా పూర్తి కావస్తుండడంతో బన్నీ తదుపరి చిత్రం ఎవరి డైరెక్షన్‌‌లో ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. తనకు ‘అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే ‘జవాన్‌‌’తో బాలీవుడ్‌‌లోనూ హిట్ కొట్టిన తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌‌లోనూ అల్లు అర్జున్ నటించబోతున్నాడు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీపై అనౌన్స్‌‌మెంట్ వస్తుందని అంతా భావించారు. 

కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ రెండు చిత్రాల్లో ఏది ముందుగా మొదలవుతుంది అన్నదే అసలు ప్రశ్న. అయితే కాస్త అటుఇటుగా రెండు చిత్రాలను మొదలుపెట్టి.. ఒకే సమయంలో సెట్స్‌‌పైకి తీసుకురావాలనే ప్లాన్‌‌లో అల్లు అర్జున్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది బన్నీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయి.