ఈ విజయం ఎందరికో స్ఫూర్తి

ఈ విజయం ఎందరికో స్ఫూర్తి

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ‘తెలుగు ఇండియ‌‌‌‌న్ ఐడ‌‌‌‌ల్-2‌‌‌‌’ ముగిసింది. సీజన్-1కు చక్కని రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్‌‌‌‌ను మరింత గ్రాండ్‌‌‌‌గా నిర్వహించారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫినాలే ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. అల్లు అర్జున్‌‌‌‌ ముఖ్య​తిథిగా హాజరై విజేతలకు ట్రోఫీని అందజేశారు.  జయరామ్, లాస్య ప్రియ, సౌజన్య భాగవతుల, కార్తికేయ, శ్రుతి నండూరి ఫినాలేలో పోటీపడి తమ గాత్రంతో అందరినీ ఇంప్రెస్ చేశారు. వీరిలో సౌజన్య విజేత‌‌‌‌గా నిలిచి అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది.

రూ.10 లక్షల ప్రైజ్ మనీని ఆమె గెలుచుకుంది. మొదటి రన్నరప్‌‌‌‌గా నిలిచిన జయరాజ్ రూ.3 లక్షలు, రెండవ రన్నరప్‌‌‌‌గా నిలిచిన లాస్యకు రూ.2 లక్షల చెక్‌‌‌‌ను అల్లు అర్జున్‌‌‌‌ అందజేశారు. హేమచంద్ర హోస్ట్  చేసిన ఈ రియాలిటీ షోకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్‌‌‌‌ కార్తిక్, గీతామాధురిలు జ‌‌‌‌డ్జ్‌‌‌‌లుగా వ్యవహ‌‌‌‌రించారు. టాలెంటెడ్‌‌‌‌ కంటెస్టెంట్స్‌‌‌‌ పెర్ఫార్మెన్స్ చూసి మనసంతా ఆనందంతో నిండిపోయిందన్న బన్నీ..  రెండేళ్ల చిన్నారికి తల్లిగా ఉంటూ ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు మ్యూజిక్‌‌‌‌ను బ్యాలెన్స్ చేసి విజేతగా నిలిచిన సౌజన్యను అభినందించారు. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందన్నారు.