హైదరాబాద్: దేశంలో క్రికెట్, సినిమా స్టార్స్ అంటే ప్రజల్లో ఉండే పాపులారిటీ ఎంతగా ఉంటుందో తెలిసింది. చాలా మంది అభిమానులు తమ ఫేవరెట్ ఆటగాళ్లు, తారల ఫొటోలను గోడలపై అతికించుకుంటూ మురిసిపోతుంటారు. మరికొందరైతే ఏకంగా తమ ఇష్టమైన నటుల కోసం గుళ్లు కూడా కట్టిస్తుంటారు. ఉదాహరణకు తమిళనాడులో సీనియర్ హీరోయిన్ ఖుష్బూకు ఫ్యాన్స్ గుడి కట్టిన విషయం తెలిసిందే. వీటిని పక్కనబెడితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను చూడటానికి ఓ ఫ్యాన్ మైళ్ల కొద్దీ నడవడం ఆసక్తిగా మారింది. సదరు వ్యక్తి పేరు పి.నాగేశ్వర్ రావు. బన్నీని కలవడానికి పలుమార్లు యత్నించిన నాగేశ్వర్.. అల్లు అర్జున్ దృష్టిలో పడటానికి పాదయాత్రగా హైదరాబాద్ చేరుకున్నాడు.
This Man P.Nageshwar Rao was walking from Macherla to Hyderabad for meet his favourite actor @alluarjun. He started on 17th & reached Banjara hills on 22nd. Despite of many trails he never meet his favourite star..So he just did a padyayathra of 250 KM #incrediblefans @SKNonline pic.twitter.com/gYQt70483L
— Agasthya Kantu (@agasthyakantu) September 22, 2020
ఫేవరెట్ స్టార్ను చూడటానికి మాచర్ల నుంచి 250 కిలో మీటర్లు నడిచి హైదరాబాద్ చేరుకోవడం చేరుకోవడం విశేషం. ‘గంగోత్రి సినిమా నుంచి బన్నీ అన్నకు నేను ఫ్యాన్. బన్నీని కలవడానికి నాలుగైదు సార్లు యత్నించా. కానీ కలవలేకపోయా. అందుకే ఆయన దృష్టిలో పడటానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. సెప్టెంబర్ 14న నడవడం మొదలుపెట్టా. సెప్టెంబర్ 22న బంజారా హిల్స్కు చేరుకున్నా’ అని నాగేశ్వర్ రావు చెప్పాడు. ఈ వీడియోను అగస్త్య కంతు అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశాడు.