నిజామాబాద్ లోరూ.3 కోట్ల విలువైన అల్ఫ్రాజోలం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

 నిజామాబాద్ లోరూ.3 కోట్ల విలువైన అల్ఫ్రాజోలం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
  • రూ.12 లక్షల క్యాష్​, స్కోడా కార్​స్వాధీనం
  • మహారాష్ట్రలోని రూ.4 కోట్ల విలువైన ఫ్యాక్టరీ సీజ్​
  • నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడి

నిజామాబాద్, వెలుగు:  మత్తుపదార్థం అల్ఫ్రాజోలంను పట్టుకొని ఇద్దరి అరెస్టు చేశామని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. దీని విలువ రూ.3 కోట్లు ఉందని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని సతారా ఏరియాలో కెమికల్​ఫ్యాక్టరీ నిర్వహణకు మరాఠా ప్రభుత్వ పర్మిషన్​పొందిన అమర్​సింగ్​ దేశ్ ముఖ్, అదే ప్రాంతానికి చెందిన బాబూరావు బస్వరాజ్ అలియాస్​ప్రసాద్​ కడేరి బయో స్టమ్ లెంట్​ కంపెనీ నిర్వహిస్తున్నారు.  వీరు ముగ్గురూ కలిసి ఫ్యాక్టరీలో అల్ఫ్రాజోలం ఉత్పత్తి చేసి కల్లు వ్యాపారులకు అమ్మడానికి నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్​గౌడ్​ను పెడ్లర్​గా నియమించుకున్నారు.

తమకు ఏజెంట్లుగా పనిచేసే మహారాష్ట్రకు చెందిన పరమేశ్వర్​, షబ్బీర్​ ద్వారా రెండున్నర కిలోల అల్ఫ్రోజోలంను లక్ష్మణ్​గౌడ్ కు ఇవ్వగా.. నిఘా పెట్టి ఈనెల 15న రాత్రి సాలూరాలో పట్టుకున్నామన్నారు.  నిందితులను జుడీషియల్​కస్టడీకి అప్పగించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు వెళ్లి కెమికల్​ఫ్యాక్టరీ నుంచి రూ.3 కోట్ల విలువైన అల్ఫ్రోజోలం పట్టుకున్నామని, రూ.12 లక్షల నగదు, నిందితుల స్కోడా కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా రూ.4 కోట్ల విలువైన ఫ్యాక్టరీని సీజ్​చేశామన్నారు. ప్రధాన నిందితులు అమర్​సింగ్​ దేశ్​ముఖ్​, బాబూరావు బస్వరాజ్​ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక రోల్​ పోషించిన బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​, రూరల్​ సీఐ విజయ్​బాబు పోలీస్​సిబ్బందిని సీపీ అభినందించారు.