టైంకు ఆఫీసుకు రావాలి
వెలుగు స్టోరీకి స్పందన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఆఫీస్కు టైం ప్రకారం రాకపోతే చర్యలు తీసుకుంటానని డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ ఉద్యోగులను హెచ్చరించారు. ‘లోకల్లో ఉండరు..టైంకు రారు’ అనే హెడ్డింగ్తో మంగళవారం వెలుగులో పబ్లిష్ అయిన స్టోరీకి ఆయన స్పందించారు. కొత్తగూడెంలోని డీఎంహెచ్ఓ ఆఫీస్లో మంగళవారం ముఖ్యమైన ఆఫీస్ స్టాఫ్తో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫీస్లో పనిచేసే వారంతా రూల్స్పాటించాలన్నారు. అందరూ టైంకు ఆఫీసులో ఉండాలన్నారు. ఉద్యోగులంతా లోకల్గా ఉండాలని ఆదేశించారు. తాను కొత్తగూడెంలోని విద్యానగర్లో ఉంటున్నానని తెలిపారు. స్టాఫ్ పనితీరుపై ప్రతి నెలా సమీక్షించనున్నట్టు స్పష్టం చేశారు.