ఉత్పత్తి తిరిగి ప్రారంభించిన అమర రాజ బ్యాటరీస్

ఉత్పత్తి తిరిగి ప్రారంభించిన అమర రాజ బ్యాటరీస్

చిత్తూరు: ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో  అమరరాజ బ్యాటరీస్ సంస్థ తన ఉత్పత్తితోపాటు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. చిత్తూరు జిల్లా లోని నూనెగుండ్లపల్లి మరియు కరకంబాడి ఫాక్టరీలలో శనివారం ఉదయం నుండే ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం జరిగిందని  అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. పర్యావరణము, భద్రత మరియు ఆరొగ్య వ్యవస్థలకు అత్యధిక ప్రాధాన్యత కొనసాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సహకరించి ఏ విధమైనటువంటి సమస్యలనైనా పరిష్కరించే దిశలో సంస్థ తరపున కార్యాచరణ చేపడుతోందని కంపెనీ ప్రకటించింది. గత కొద్దిరోజులుగా ఉన్న తాత్కాలిక అంతరాయం వల్ల కంపెనీ కార్యాలాపాలపై ఎటువంటి ప్రభావం లేదని మరియు సంస్థ ఉత్పత్తులను యధావిధిగా అందించగలమని భాగస్వాములందరికీ హమీ ఇచ్చింది.