
భారత దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక యాత్రల్లో ఒకటైన అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)ప్రారంభమైంది. జమ్మూకాశ్మీర్ లోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బుధవారం ( జులై 6) ఉదయం అమర్ నాథ్ యాత్రను లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు యాత్రి నివాస్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యాత్రికులు 'హర్ హర్ మహాదేవ్, బం బం భోలే' నినాదాలు చేశారు.
#WATCH | J&K | First batch of Shri Amarnath Yatra pilgrims arrive in Chanderkote of Ramban district. pic.twitter.com/BlV5pR7WHJ
— ANI (@ANI) July 2, 2025
అమర్ నాథ్ యాత్ర భక్తి మాత్రమే కాదని .. దేశ ఐక్యతను కాపాడుతుందని... ఎల్ జీ సిన్హా అన్నారు. ఈ యాత్ర వలన సోదరభావం పెరుగుపడుతుందన్నారు. ఈ యాత్ర కోసం ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ సంవత్సరం (2025) పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు వచ్చాయి. మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో.. యాత్రికులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర మార్గాన్ని నో ఫ్లైజోన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర బాల్తాల్, పహల్గామ్ మార్గాల ద్వారా ప్రారంభమై, ఆగస్టు 9న రక్షా బంధన్ రోజు ముగుస్తుంది. భద్రతా కారణాలతో జవాన్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. RFID ట్యాగ్ల ద్వారా యాత్రికుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.