ఫెస్టివల్ సేల్కు రెడీ.. ప్రకటించిన అమెజాన్

ఫెస్టివల్ సేల్కు రెడీ.. ప్రకటించిన అమెజాన్

హైదరాబాద్​, వెలుగు: జీఎస్టీ తగ్గినందున ఈసారి గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్ ​సందర్భంగా తెలంగాణ నుంచి స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు,   ప్రీమియం టీవీలు, ఫ్రిజ్​లు, ఏసీలు, వాషింగ్​మెషీన్లు భారీగా అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని అమెజాన్​ పేర్కొంది. ఈ నెల 23న మొదలయ్యే ఈ సేల్​కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని సంస్థ సీనియర్​ఎగ్జిక్యూటివ్​​ చెప్పారు. పెద్ద ఎత్తున  సీజనల్​​ జాబ్స్​ ఇచ్చామని అన్నారు.

‘‘తెలంగాణలో మాకు 57 వేల మందికి పైగా సెల్లర్లు ఉన్నారు. 18 వేల లోకల్​ షాప్స్​ ఉన్నాయి. మూడు ఫుల్​ఫిల్​మెంట్​ సెంటర్లు, 500 కంటే ఎక్కువ డెలివరీ స్టేషన్లు ఉన్నాయి.  కరీంనగర్​, వరంగల్​, నల్గొండ లాంటి టైర్​-2 సిటీల్లోనూ డిమాండ్​ ఉంది. కస్టమర్లు ఇప్పుడు అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్​ ఫీచర్లు, మెరుగైన పనితీరు ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు” అని అమెజాన్​ ఇండియా డైరెక్టర్ జెబా ఖాన్​ చెప్పారు.