అంబేద్కర్ వర్థంతి : నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అంబేద్కర్ వర్థంతి : నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. కొంతమంది ముఖ్యమంత్రులు రాజ్యాంగం మార్చాలనే కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం పనికిరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. రాజ్యాంగం అనుసరించే మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. పంచతీర్థ పేరుతో అంబేద్కర్ కు సంబందించిన స్థలాలన్నీ అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ స్థలాలు సందర్శించడానికి పంచతీర్థ పేరుతో ఏప్రిల్ 14న కొత్త రైలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.