
ఒకే రూమ్లో ఐదు క్లాసులు నిర్వహిస్తున్న దుస్థితి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీ ప్రైమరీ స్కూల్లో ఉంది. 65 మంది విద్యార్థులు ఉండగా, ఇరుకిరుకుగా కూర్చుని క్లాసులు వింటున్నారు. రెగ్యులర్ టీచర్లు ఇద్దరు ఉండగా, మరొకరు డిప్యూటేషన్పై వచ్చారు. ఈసారి 1వ తరగతిలో 21 మంది విద్యార్థులు చేరారు.
గతంలో కంటే ఈసారి అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. క్లాస్ రూమ్కు ముందు ఉన్న వరండాను కూడా వినియోగించుకోవాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు చొరవ చూపి అదనపు క్లాస్ రూమ్ మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - కామారెడ్డి, వెలుగు