హైదరాబాద్: ఈ నెల 12 నుంచి అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ క్లాసులు ప్రారంభమవుతున్నట్లు హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. కె. జ్యోత్స్న, స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫస్టియర్ 1వ సెమిస్టర్, సెకండియర్ 3వ సెమిస్టర్, థర్డ్ ఇయర్ 5వ సెమిస్టర్ల స్టూడెంట్లకు ఉదయం 9 గంటల నుంచి క్లాసులు జరుగుతాయన్నారు. స్టూడెంట్లు క్లాసులకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 7382929771 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.