నోయిడా: రోడ్డు పనులు జరుగుతుండడంతో అడ్డంగా పెట్టిన డ్రమ్ను ఢీకొట్టి ఒక అంబులెన్స్ పల్టీ కొట్టింది. పేషెంట్తో వెళ్తున్న అంబులెన్స్కు ప్రమాదం జరగడంతో వెంటనే మరో అంబులెన్స్ వచ్చి ఆ పేషెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో బుధవారం ఉదయం జరిగింది.
గ్రేటర్ నోయిడాలోని పరీ చౌక్ ప్రాంతానికి చెందిన ఒక పేషెంట్ను తీసుకుని అంబులెన్స్ ఢిల్లీకి వేగంగా వెళ్తుండగా మహామాయ ఫ్లై ఓవర్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు పనులు చేస్తున్న సిబ్బంది అడ్డంగా పెట్టిన డ్రమ్ను స్పీడ్లో అంబులెన్స్ డ్రైవర్ గమనించలేకపోయాడు. దీంతో వేగంగా డ్రమ్ను డ్యాష్ కొట్టిన సమయంలో కంట్రోల్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశాడు. కానీ అంబులెన్స్ ఆ స్పీడ్లో తిరగబడిందని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ ప్రమాదం గురించి తెలియగానే మరో అంబులెన్స్తో ఘటనా స్థలాని చేరుకున్నట్టు చెప్పారు. పల్టీ కొట్టిన అంబులెన్స్లో ఉన్న పేషెంట్ను దానిలోకి షిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించామన్నారు. అంబులెన్స్ డ్రైవర్కు స్పల్ప గాయాలే అయ్యాయని, అతడిని మరో వాహనంలో ఆస్పత్రికి పంపి చికిత్స చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా ఉన్న అంబులెన్స్ను తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశామని పోలీసులు చెప్పారు.