- బంగ్లా హిందువులను రక్షించండి
న్యూఢిల్లీ: వివాదాస్పద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ)ను అమలు చేయాలని కాంగ్రెస్ నేత మిలింద్ డియోరా అన్నారు. బంగ్లాదేశీ హిందువులను కాపాడేందుకు ఈ చట్టాన్ని అమలు చేయాలన్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మిలింద్ డియోరా వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.
Bangladesh’s escalating communal violence is extremely worrying.
— Milind Deora | मिलिंद देवरा ☮️ (@milinddeora) October 18, 2021
CAA must be amended to protect & rehabilitate Bangladeshi Hindus fleeing religious persecution.
India must also reject & thwart any communal attempt to equate Indian Muslims with Bangladeshi Islamists.
‘బంగ్లాదేశ్లో మతపరమైన హింస పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అణచివేతకు గురవుతున్న బంగ్లా హిందువులను రక్షించడానికి, వారికి పునరావాసం కల్పించేందుకు సీఏఏను అమలు చేయాల్సిందే’ అని మిలింద్ డియోరా ట్వీట్ చేశారు. భారతీయ ముస్లింలు, బంగ్లాదేశీ ఇస్లాంవాదులు ఒక్కటే అన్న భావనను సృష్టించడానికి జరుగుతున్న మతపరమైన కుట్రలను సమర్థంగా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.