లోక్​సభ ఎన్నికల కోసం ఓటర్​ లిస్ట్ ​సవరణ : వికాస్​రాజ్

లోక్​సభ ఎన్నికల కోసం ఓటర్​ లిస్ట్ ​సవరణ : వికాస్​రాజ్

నిజామాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​సూచించారు. ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ లిస్టు రూపొందేలా చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ఆయన కలెక్టర్, రిటర్నింగ్​ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో  మాట్లాడారు. అసెంబ్లీ సెగ్మెంట్ ​యూనిట్​గా ఎన్నికల ఏర్పాట్లు చేయాలన్నారు. స్ర్టాంగ్​ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఎంపిక పూర్తి చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తలెత్తిన లా అండ్​ఆర్డర్​ ఇష్యూలు లోక్​సభ ఎలక్షన్స్​లో రిపీట్​కాకుండా చూడాలన్నారు.

ఓటర్​ లిస్టు మార్పుచేర్పుల దరఖాస్తులు వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. జనవరి 6న ముసాయిదా ఓటర్​ లిస్ట్​ రిలీజ్​చేస్తామని తెలిపారు. అభ్యంతరాలు స్వీకరించి  ఫిబ్రవరి 8న ఫైనల్​లిస్ట్​ ప్రకటిస్తామన్నారు. అడిషనల్​కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ మంద మకరంద్, ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేంద్రకుమార్, వినోద్​కుమార్, భుజంగ్​రావు పాల్గొన్నారు.