క‌రోనా రెండే‌ళ్లు ఉంటుంద‌ట‌

క‌రోనా రెండే‌ళ్లు ఉంటుంద‌ట‌

అమెరికా: క‌రోనాతో ప్ర‌పంచం అల్ల‌క‌ల్ల‌లం అవుతుండ‌గా ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. క‌రోనాకు చెక్ పెట్టేందుకు ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని దిగ్గ‌జ దేశాలు వ్యాక్సిన్ కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ ప్ర‌భావం ఇప్ప‌ట్లో తగ్గేలా క‌నిపిస్త‌లేద‌ని చెబుతున్నారు అమెరికా సైంటిస్టులు. క‌రోనా ప్ర‌భావం ప్ర‌పంచంపై రెండేళ్ల వ‌ర‌కు (2022) ఉంటుంద‌ని అమెరికాలోని శాస్త్ర‌వేత్త‌ల బృందం తెలిపింది.

వేస‌వి త‌ర్వాత శీతాకాలంలో కోవిడ్-19 మ‌రింత విజృంభిస్తుంద‌ని మిన్నెసోటా వ‌ర్సిటీకి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ ఇన్ఫెక్ష‌న్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాల‌సీ శాస్త్ర‌వేత్త‌ల బృందం నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌జ‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంద‌ని చెప్పింది. వ్యాధి తీవ్ర‌త త‌గ్గిన త‌ర్వాత కూడా సీజ‌న‌ల్ గా కోవిడ్-19 వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది. దీనిని బ‌ట్టి మ‌నిషి ప్ర‌తిరోజూ మంచి ఫుడ్, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, సోష‌ల్ డిస్టెన్స్ లాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అభిప్రాయ ప‌డుతున్నారు నిపుణులు.