అమెరికాలో మళ్లీ కాల్పులు..ముగ్గురు మృతి

అమెరికాలో మళ్లీ కాల్పులు..ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.   ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లెలో ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీ సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు నల్లజాతీయులు మృతి చెందారు.  వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు.  జాత్యాహంకారంతోనే దుండగుడు నల్లజాతీయులపై  కాల్పులు జరిపినట్లు జాక్సన్‌విల్లె పోలీసులు తెలిపారు.

కాల్పుల అనంతరం దుండగుడు తనను తాను రక్షించుకునేందుకు డాలర్ జనరల్  స్టోర్‌లోకి చోరబడ్డాడు. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ముగ్గురిని కాల్చిన తర్వాత  హంతకుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హంతకుడి వయస్సు 20ఏళ్లుగా పోలీసులు గుర్తించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.