241 మంది మనవాళ్లను దత్తత తీసుకున్న అమెరికన్స్‌

241 మంది మనవాళ్లను దత్తత తీసుకున్న అమెరికన్స్‌

వాషింగ్టన్‌: అమెరికన్‌ ఫ్యామిలీస్‌ 2019లో మన దేశానికి చెందిన 241 మంది పిల్లల్ని దత్తతు తీసుకున్నాయి. పిల్లల్ని దత్తతు తీసుకునేందుకు మొత్తం 2,971 మందికి ఇమ్మిగ్రెంట్‌ వీసాలు జారీ చేశామని అధికారులు చెప్పారు. వారిలో వేరే దేశాలకు చెందిన వారు 2677 మంది కాగా.. యునైటెడ్‌ స్టేట్స్‌కు చెందిన వారు 294 మంది అని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ 12వ వార్షిక రిపోర్ట్‌ను ఇష్యూ చేసింది. అమెరికాలో ఇంటర్‌‌ కంట్రీ అడాప్షన్స్‌ చాలా తగ్గిపోయాయని స్పెషల్‌ అడ్వైజరీ ఫర్‌‌ చిల్డ్రన్‌ ఇష్యూస్‌ అధికారి ఒకరు చెప్పారు. చైనా, ఇథియోపియా నుంచి అంతర్‌‌ – దేశ స్వీకరణలు తగ్గాయని అన్నారు. ఆ దేశంలోని నిరంతర సామాజిక, ఆర్థిక, చట్టపరమైన మార్పలు వల్ల ఇది జరిగి ఉండొచ్చని చెప్పారు. చాలా దేశాలు డొమస్టిక్‌ ఆడప్షన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయని అందుకే తగ్గిపోతుందని అన్నారు. కరోనా కారణంగా దత్తతు తీసుకునే ప్రాసెస్‌ ఆగిపోయిందని, తర్వాత కాలంలో వీసాలు జారీ చేస్తామని అన్నారు. అమెరికా నుంచి వేరే దేశాల వారు 56 మందిని దత్తతు తీసున్నారని నివేదిక విడుదల చేశారు.