భూ నిర్వాసితులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

భూ నిర్వాసితులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

తీవ్ర ఉద్రిక్తతల మధ్య గౌరవెల్లి భూ నిర్వాసితుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు- ప్రొక్లైయినర్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు- భూనిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణలో నిర్వాసితులను పోలీసులు చితకొడ్తున్నారు. లాఠీ చార్జ్ తో నిర్వాసితుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ దెబ్బలను సైతం తట్టుకోని హుస్నాబాద్ RDO ఆఫీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసితుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో హుస్నాబాద్ టౌన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గౌరవెల్లి భూ నిర్వాహితుల ర్యాలీని అడ్డుకోవటంపై మండిపడుతున్నారు.