కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘అమిగోస్’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం, వెరైటీ ఉన్న సినిమా ఇది. హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చే చిత్రమవుతుంది. ప్రతి సీన్ డిఫరెంట్గా ఉండాలని ఆలోచించే రాజేంద్ర, అంతే కొత్తగా తీశాడు. మూవీ సక్సెస్ క్రెడిట్ అతనిదే. మైత్రి సంస్థ నా సొంత బ్యానర్ లాంటిది. ఆషిక చాలా బాగా నటించింది. మూడు పాత్రల్లో ఒక క్యారెక్టర్ నుండి మరొకదానికి మారడం కొంత కష్టంగానే అనిపించింది. కానీ ఇష్టంతో చేశా. ప్రేక్షకులు ఏమాత్రం డిజప్పాయింట్ అవకుండా హ్యాపీ ఫీలయ్యే సినిమా ఇది’ అన్నారు.
‘రేడియో జాకీగా నటించా. తెలుగులో నాకిది పర్ఫెక్ట్ లాంచ్ అవుతుంది’ అంది ఆషిక. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను సర్ర్ప్రైజ్ చేసే డిఫరెంట్ మూవీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో రేసింగ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్గా ఉంటుంది. కళ్యాణ్ రామ్ గారి నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది’ అన్నాడు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకముంది. ఈ సినిమాతో ఈ ఏడాది మా బ్యానర్లో హ్యాట్రిక్ అందుకుంటాం’ అన్నారు. మరో నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ ‘చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. వెరైటీ కోరుకునే అందరికీ నచ్చుతుంది. ఎన్టీఆర్ గారు సినిమా చూసి హ్యాపీ ఫీలయ్యారు. అద్భుతంగా ఉందని ప్రశసించారు’
అని చెప్పారు.