బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా

బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా

రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ కు అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం 2.30 స్పెషల్ ప్లైట్ లో ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కానున్నారు అమిత్ షా. సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బీజేపీ బహిరంగ సభకు అటెండ్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి వెళ్లనున్నారు షా. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ లోని  నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు హోటల్ నుంచి తుక్కుగూడ వెళ్తారు. రాత్రి 8 గంటల వరకు బీజేపీ బహిరంగ సభలో పాల్గొని... 8.30 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు అమిత్ షా.

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్  చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ సభ నిర్వహిస్తోంది బీజేపీ. తుక్కుగూడ ORR ఎగ్జిట్ - 14 సమీపంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుకు, వచ్చే ఎన్నికల లక్ష్యానికి ఈ సభ కీలకమని భావిస్తోంది కమలం పార్టీ.