ఇవాళ  భువనగిరికి అమిత్​ షా

ఇవాళ  భువనగిరికి అమిత్​ షా

యాదాద్రి, వెలుగు :  ఎన్నికల ప్రచారంలో భాగంగా   భువనగిరి పార్లమెంట్​ పరిధిలో నిర్వహిస్తున్న   సభకు కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్​  షా రానున్నారు. గురువారం ఉదయం బేగంపేట ఎయిర్​పోర్టుకు  చేరుకొని అక్కడి నుంచి రాయిగిరిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్​కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు  బహిరంగ సభలో  మాట్లాడుతారు. అనంతరం బేగంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలోని వికారాబాద్​లో నిర్వహించే బహిరంగ సభకు వెళ్తారు. సభ ఏర్పాట్లను కో ఆర్డినేట్​ చాడ సురేశ్​ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి, పాపారావు, పాశం భాస్కర్​, దాసరి మల్లేశం పర్యవేక్షిస్తున్నారు.  

భువనగిరిలో బీజేపీ బైక్​  ర్యాలీ

యాదాద్రి, వెలుగు : భువనగిరిలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ  మున్సిపల్ వైస్​ చైర్మన్​ మాయ దశరథ నేతృత్వంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు.    అమిత్​ షా  బహిరంగ సభను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.