అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా

అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా పడింది. జనవరి 28న రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించాల్సి ఉండగా.. కొన్ని అత్యవసర పనుల వల్ల వాయిదా పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లలో నిర్వహించే కీలక సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దుతో ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి.