మనిషికి జీవనధారం మొక్కలే : భట్టి విక్రమార్క సతీమణి

మనిషికి జీవనధారం మొక్కలే : భట్టి విక్రమార్క సతీమణి
  •    డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్​ పర్సన్​ నందిని

మధిర, వెలుగు:   మనిషికి జీవనధారం మొక్కలేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్​ పర్సన్​ మల్లు నందిని తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడులో  ఆమె జన్మదిన వేడుకలను షేర్  స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. 

పట్టణంలోని పలు చోట్ల బర్త్​ డే వేడుకలను గ్రాండ్​గా సెలబ్రేట్​ చేశారు. ఈ కార్యక్రమంలో  షేర్  స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ గోపాలరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణగుప్త, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్,  రిటైర్డ్ ఎంపీడీఓ మాధవరపు నాగేశ్వరావు పాల్గొన్నారు.