కూతురు కోసం కడియం ఆరాటం

కూతురు కోసం కడియం ఆరాటం
  •     అసంతృప్త నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం
  •     చిన్నా పెద్ద లీడర్లను కలిసి మద్దతు కోరుతున్న వైనం

హనుమకొండ, వెలుగు : కారు దిగి కాంగ్రెస్​లో చేరి, తన కూతురు కావ్యకు వరంగల్​ టికెట్​ఇప్పించుకున్న కడియం శ్రీహరి.. ఇప్పుడు ఆమెను గెలిపించుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఇప్పటికే  లెఫ్ట్​పార్టీలు, దళిత సంఘాల మద్దతు కూడగట్టిన కడియం, కాంగ్రెస్​లో కావ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి శ్రీహరిని కాంగ్రెస్​లోకి తీసుకోవడాన్ని స్టేషన్ ఘన్​పూర్​లో శనిగపురం ఇందిర తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో టికెట్​రాగానే తన కూతురు కావ్యతో కలిసి ఇందిర మద్దతు కోరారు.

తర్వాత వరుసగా జిల్లా మంత్రి కొండా సురేఖ, పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్​చార్జి రేవూరి ప్రకాశ్​ రెడ్డిని కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ  ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ పెద్దరికం ప్రదర్శించే కడియం.. కూతురు కోసం ఓ మెట్టు దిగడంతో కాంగ్రెస్​లో సానుకూల వాతావరణం కనిపిస్తోందని చర్చ జరుగుతోంది.