పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. ఎస్సై సబిత తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ముషీరాబాద్ క్రాస్ రోడ్ సమీపంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో కిందపడి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అతడిని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లి అడ్మిట్ చేయించారు.
అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ వ్యక్తి చనిపోయాడు. అతడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో డెడ్బాడీని పోలీసులు మార్చురీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.