ఏ మాస్టర్ పీస్‌‌ మూవీ నుండి అప్డెట్

ఏ మాస్టర్ పీస్‌‌ మూవీ నుండి అప్డెట్

అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి  ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్‌‌’. శుక్ర, మాటరాని మౌనమిది లాంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ తెరకెక్కిస్తున్నాడు. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో స్టూడియో మెర్జ్‌‌ఎక్స్‌‌ఆర్ భాగస్వామి అయ్యింది. ఉగాది సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఈ సినిమా అందించబోతోందని, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌‌తో తెరకెక్కిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.